సెప్టెంబరు 16 నుంచి మళ్లీ నిషేధం.. అమల్లోకి
ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజులపాటు గడువును పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబరు 15 వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెప్టెంబరు 16 నుంచి బదిలీలపై మళ్లీ నిషేదం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే చాలా ప్రభుత్వశాఖలు బదిలీల విధివిధానాల్ని రూపొందించుకోకపోవటంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ, రెవెన్యూ, రహదారులు భవనాలు, రవాణాశాఖలకు చెందిన బదిలీ మార్గదర్శకాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విధివిధానాల రూపకల్పలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Tags :