వాల్ట్ డిస్నీ కొత్త చైర్మన్గా గోర్మన్
వాల్ట్ డిస్నీ కొత్త చైర్మన్గా జేమ్స్ గోర్మన్ 2025 జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్నారు. డిస్నీ బోర్డులో తొమ్మిదేళ్ల పాటు సేవలు అందించిన మార్క్ పార్కర్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగుతుండటంతో, ఆయన స్థానంలో గోర్మన్ రానున్నారు. 2026 ప్రారంభంలో కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) పేరును కూడా ప్రకటించే అవకాశం ఉందని వాల్ట్ డిస్నీ తెలిపింది. మోర్గాన్ స్టాన్లీకి 2010 నుంచి 2023 వరకు సీఈఓగా, 2012 నుంచి 2023 వరకు చైర్మన్గా గోర్మన్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డిస్నీకి సక్సెషన్ ప్లానింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు.
Tags :