అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు : టీటీడీ
![అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు : టీటీడీ](https://www.telugutimes.net/storage/news/news_new_75425.jpg)
శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి, గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని, అది పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడిరచారు. కానీ అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :