ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తారని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
Tags :