ASBL Koncept Ambience
facebook whatsapp X

వారికి కేంద్రం అండగా నిలుస్తుంది : కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

వారికి కేంద్రం అండగా నిలుస్తుంది : కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

ఖమ్మం పరిసరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మరో కేంద్ర మంత్రి  బండి సంజయ్‌తో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం తరపున వరద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భారీ వరదలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అండగా నిలుస్తుంది. గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదు. నేను కూడా రైతునే, రైతుల పరిస్థితి బాగా తెలుసు. వరదల కారణంగా వరి, ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. పశువులు, ఇతర మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర ప్రభుత్వం తరపున వరద బాధితులకు అండగా నిలుస్తాం అని శివరాజ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :