భారతీయులకు అగ్రరాజ్యం మరో అవకాశం
అమెరికా వెళ్లాలని కోరుకోనే భారతీయులకు అగ్రరాజ్యం మరో అవకాశం కల్పించింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. పర్యటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు విద్యార్థులకు ఇవి దోహదం చేస్తాయని తెలిపింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన స్టాట్ల వల్ల వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి దోహదం చేస్తాయని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అంతేకాకుండా అమెరికా, భారత్ సంబంధాలను మరింత బలోపేతంచేయడంలో కీలకమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అభిప్రాయపడిరది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను చేపట్టినట్లు యూఎస్ ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్, పర్యటకులపై దృష్టి సారించినట్లు తెలిపింది.