అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా
భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఇదివరకు పనిచేసిన తరుణ్జిత్ సంధు జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో వినయ్ క్వాత్రాను విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) నియమించింది. త్వరలోనే వినయ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎంఈఏ తెలిపింది. 1988లో ఐఎఫ్ఎస్ అదికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఫ్రాన్స్లో, 2020 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు నేపాల్ లో భారత రాయబారిగా ఉన్నారు. అనంతరం 2022 మే 1 నుంచి 2024 జులై 14 వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
Tags :