న్యూఇంగ్లాండ్లో అంబరాన్ని అంటిన వినాయక చవితి ఉత్సవాలు
తానా న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ఉత్సాహభరితమైన, సంతోషకరమైన గణేష్ ఉత్సవాన్ని బోస్టన్లోని మెడ్వేలో వైభవంగా జరుపుకున్నారు. సుమారు 350 మంది సంతోషకరమైన భక్తులతోటి ప్రాగణమంతా కళకళలాడింది.
గణేశుడిని వేదికపైకి తీసుకురావడానికి సాంప్రదాయ నృత్యం చేసిన కోలాటం టీమ్తో ఉత్సవాలు ఘనంగా, ఉత్సాహంగా మొదలయ్యాయి. లయబద్ధమైన దరువులు.. పండుగ సాంస్కృతిక సారాంశంతో ప్రతిధ్వనించే ఒక సజీవ వాతావరణాన్ని సృష్టించి, గణేష్ ఉత్సవం వేడుకలకు టోన్ సెట్ చేశాయి. అనంతరం గణనాథుడి ఆశీస్సులు కోరుతూ పవిత్ర పూజ నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించి సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకున్నారు. అక్కడ పూజ నిర్వహించిన పూజారి భక్తులందరినీ ఆశీర్వదించారు,
సుమారు 350 మంది స్థానిక భక్తులు ఈ వినాయక చవితి సంబరాల్లో ఆనందంగా పాలుపంచుకున్నారు. గణనాథుడిని స్మరిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. చిన్నపిల్లలు శమంతకమణి కథని భక్తి భావముతో చదివారు. ఉత్సవంలో కొలువు తీరివున్న వినాయకుడికి ప్రతి ఒక్కరు హృదయపూర్వక హారతి ఇచ్చారు. ఉత్సవం నిర్వహించిన ప్రాంగణమంతా గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమ్రోగింది.
ఈ సంవత్సరం గణేశ్ ఉత్సవంలో అనేక మంది కొత్తవారు పాల్గొనడం కూడా మెడ్వే లో పెరుగుతున్న భక్తుల సమూహాన్ని జోడించింది. వారి ఉనికి ఈవెంట్కు కొత్త శక్తిని అందించింది. ఉత్సవానికి హాజరైన వారికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి, భార్గవ్ ప్రక్కి, సాయి మునికుంట్ల, శ్రీహరి వలివేటి, రవి దాదిరెడ్డి, శ్రీనివాస్ బచ్చు, నిరంజన్ అవధూత, శ్రీనివాస్ కంతేటి, శ్రీనివాస్ గుండిమెడ, బాలాజీ బిరాలి, శ్రీనివాస్ పచ్చల, రామ్ భాస్కర్, భాస్కర్ గొనె, అమర్ జయం, చాంద్, ఆంజనేయ రాజబోయిన, ప్రతాప్ సోమల, వేంకేటేశ్వర రావు గారెపల్లి, ఆదిత్య పెళ్ళోర్, రాయవరపు, సురేష్ అమరకొండ ,రమేష్ జంగారెడ్డి, రాకేష్ కందనూరు, గాంధీ గంధం, రాపోల, పిళ్లై, శ్రీనివాస్ చాగంటి, దీపక్ పేరిచెర్ల, రమణ తీరువీధి, తమ తమ కుటుంబాలతోటి ఈ వినాయక చవితి సంబరాలు సామరస్యంగా, స్ఫూర్తి దాయకంగా జరుపుకోవటానికి తన వంతు కృషి చేశారు.
ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తానా న్యూ ఇంగ్లాండ్ కోఆర్డినేటర్ మరియు అమెరికన్ స్కూల్ కమిటీ మెంబెర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశి కాంత్ వల్లేపల్లి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.