విశ్వంపైనే భారం వేసిన ఆ నలుగురు
ఈ వారం రిలీజ్ కానున్న విశ్యం(Viswam) సినిమాపై ఆడియన్స్ కు భారీ అంచనాలేం లేవు కానీ దసరా సీజన్ లో మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్ అవనుందని ఆడియన్స్ నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా విజయం ఆ సినిమాకు పని చేసిన నలుగురికి మాత్రం కీలకం కానుంది. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శ్రీను వైట్ల(Sreenu Vaitla).
గత కొన్నేళ్లుగా ఫామ్ లో లేని శ్రీను వైట్ల ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడాయన విశ్వంతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలి. విశ్వం సినిమాతో తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటానని ఇంటర్వ్యూల్లో ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు శ్రీను వైట్ల. హీరో గోపీచంద్(Gopi chand) కు కూడా ఈ సినిమా విజయం ఎంతో అవసరం.
మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ కు గత కొన్ని సినిమాలుగా హిట్ పడింది లేదు. తన టాలెంట్ అంతా వేస్ట్ అవుతూ వస్తుంది. కెరీర్ స్టార్ట్ చేసిన నుంచి ఫ్లాపులే తప్ప హిట్ రుచి చూడని కావ్య థాపర్(Kavya Thapar) కు ఈ సినిమా హిట్ అయితే తర్వాత కొత్త ఛాన్సులొచ్చే అవకాశముంది. ఇక ఆఖరిగా నిర్మాతలైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)కి కూడా ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. ఆ బ్యానర్ నుంచి ఆఖరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్(Mr.Bachan) దారుణంగా ఫ్లాప్ అయింది. రీసెంట్ గా వచ్చిన శ్వాగ్(Swag) కు యూత్ నుంచి మంచి టాక్ వస్తున్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం దాని వైపు చూడకపోవడంతో బాక్సాఫీస్ నెంబర్లేమీ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి వారి అంచనాలను విశ్వం ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.