టిల్లు స్వ్కేర్ డైరెక్టర్ నెక్ట్స్ ఎవరితో?
ఈ ఇయర్ రిలీజైన హిట్ సినిమాల్లో టిల్లు స్వ్కేర్ కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ను ఈ సినిమా సాధించింది. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించినప్పటికీ టిల్లు స్వ్కేర్ సక్సెస్ క్రెడిట్ మొత్తం సిద్దు అకౌంట్లోనే పడింది. టిల్లు స్వ్కేర్ తర్వాత సిద్దు రెండు సినిమాలను లైన్ లో పెట్టి బిజీ అయిపోయాడు. కానీ మల్లిక్ రామ్ తర్వాత ఏం చేయబోతున్నాడనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మల్లిక్ రామ్, సందీప్ కిషన్ తో తన నెక్ట్స్ ప్రాజెక్టును చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి పని చేస్తుంది సినిమా కోసం కాదని, ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ కోసమని సమాచారం.
రాజీవ్ చిలక ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఓటీటీలో ఎంతో విశేష అనుభవముంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వెబ్ సిరీస్ ను చేస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్న సందీప్ కిషన్ అది పూర్తయ్యాక ఈ వెబ్ సిరీస్ను మొదలుపెట్టే ఛాన్సుంది.