ASBL Koncept Ambience
facebook whatsapp X

టీడీపీ కార్యాలయంపై దాడి.. ప్రధాన నిందితుడికి షాక్‌

టీడీపీ కార్యాలయంపై దాడి.. ప్రధాన నిందితుడికి షాక్‌

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ1గా ఉన్న పానుగంటి చైతన్యకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ పొడిగించింది. మూడు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం గుంటూరులోని  6వ అదనపు న్యాయస్థానం ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. మూడు రోజుల కస్టడీలో అధికారుల ప్రశ్నలకు చైతన్య  స్పందించలేదని, అన్నింటికీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాననే సమాధానాలిస్తూ, విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం చైతన్యకు మరో రెండు వారాలు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అతడిని కోర్టును నుంచి విజయవాడ జైలుకు తరలించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :