సీఎం రేవంత్, భట్టిలను ఆహ్వానించిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆమె ప్రజాభవన్కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాలని వారిని ఆమె ఆహ్వానించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియాగాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు షర్మిల తెలిపారు.
Tags :