స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడుల వేటలో భాగంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
Tags :