ASBL Koncept Ambience

హైదరాబాద్‌ లో ఛార్లెస్‌ స్క్వాబ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

హైదరాబాద్‌ లో ఛార్లెస్‌ స్క్వాబ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్‌ స్క్వాబ్‌ కంపెనీ హైదరాబాద్‌ లో టెక్నాలజీ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ హైదరాబాద్‌ కావటం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ఛార్లెస్‌ స్క్వాబ్‌ కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ లు డెన్నిస్‌ హోవార్డ్‌, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడిరచారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రేవంత్‌ రెడ్డి ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్‌ స్క్వాబ్‌ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

 

Click here for Photogallery

 

 

Tags :