ASBL Koncept Ambience

టెక్సాస్‌ లో సిఎం రేవంత్‌ బృందం...మహాత్మునికి నివాళులు

టెక్సాస్‌ లో సిఎం రేవంత్‌ బృందం...మహాత్మునికి నివాళులు

అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో కలిసి టెక్సాస్‌కు వచ్చారు. టెక్సాస్‌ నగరంలోని,ఇర్వింగ్‌ లోని ‘‘మహాత్మా గాంధీ మెమోరియల్‌ ప్లాజా’’ లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. వారికి మహాత్మాగాంధీ మెమోరియల్‌ నార్త్‌ టెక్సాస్‌ బోర్డ్‌ ప్రముఖులు ప్రసాద్‌ తోటకూర, మురళీ వెన్నం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ విగ్రహం ఏర్పాటు ఇతర విషయాలను వారికి వివరించారు. అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

 

Click here for Photogallery

 

 

Tags :