అడోబి సిస్టమ్ సిఇఓ శంతను నారాయణ్తో రేవంత్ టీమ్ భేటీ
కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం ప్రఖ్యాత అడోబి సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ గారితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబర్చిన శంతను నారాయణ్ గారు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించారు.
స్ఫూర్తిదాయకమై వ్యక్తి, సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయులైన టెక్ విజనరీ శంతను నారాయణ్ గారిని కలవడం భావోద్వేగమైన అనుభూతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్దుల్లో ఒకరు శాంతను నారాయణ గారు అని సీఎం పేర్కొన్నారు.