అంధుల క్రికెట్ క్రీడాకారులతో రేవంత్ రెడ్డి
అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ఉన్న భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని అన్నారు. న్యూయార్క్ నగరంలో వారిని కలుసుకునే సందర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags :