ASBL Koncept Ambience

న్యూజెర్సీలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ అమెరికా విజయ సంబరాలు

న్యూజెర్సీలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ అమెరికా విజయ సంబరాలు

న్యూజెర్సీ రాష్టంలో ఎడిసన్‌ నగరం రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో సార్వత్రిక ఎన్నికలలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ చారిత్రాత్మక విజయాన్ని భారతీయ అమెరికన్‌ సమాజం జరుపుకుంది. అఫ్‌ బీజేపీ అమెరికా అధ్యక్షుడు డాక్టర్‌ అడపా ప్రసాద్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మరియు దాని మిత్రపక్షాలు వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల హాజరైన వారు ఆనందాన్ని ప్రకటించారు. ఈ గొప్ప వేడుకకు 800 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం ఉత్సాహభరితమైన డోల్‌ తాషా ప్రదర్శనలు మరియు ఎన్నారైల నృత్యాలతో ప్రారంభమైంది, శ్రీమతి జ్యోత్స్న శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డా. అడపా ప్రసాద్‌ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జేపీ నడ్డా మరియు ఎన్‌డిఎ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు.  అఫ్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వాసుదేవ్‌ పటేల్‌ కొత్త  ప్రభుత్వం తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో, రెండవ ప్రపంచ యుద్ధానంతరం, వరుసగా మూడోసారి ఎన్నికైన ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ అని, ప్రతిసారి స్థిరమైన ఓట్ల శాతంతో అంతర్జాతీయ రికార్డును నెలకొల్పారని శ్రీ కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన తదితర బీజేపీతోపాటు దాని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల విజయాన్ని ఆయన ప్రశంసించారు. డా. సుధీర్‌ పారిఖ్‌, శ్రీ ఆల్బర్ట్‌ జెస్సాని మరియు శ్రీ పీయూష్‌ పటేల్‌ బిజెపి ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు.

అఫ్‌ బీజేపీ తెలంగాణ కన్వీనర్‌ / అధ్యక్షుడు విలాస్‌ రెడ్డి జంబుల మాట్లాడుతూ తెలంగాణలో ఎంపీ సీట్ల  కోసం, అమెరికాలో అన్ని తెలంగాణ అఫ్‌ బీజేపీ  కమిటీ చాఫ్టర్లు కలిసి కట్టుగా 12 ఎంపీ జూమ్‌ కాల్స్‌, ఫోన్‌ కాల్‌ కాంపెయిన్‌, సోషల్‌ మీడియా లో వీడియోలు, ఛాయ్‌ పే చర్చలు, గ్లోబల్‌  ఛాయ్‌ పే చర్చలు, యజ్ఞాలు /హోమములు లాంటివి చేసి మొత్తం 17 ఎంపీ లలో 8 రావడం కోసం చేసిన కృషిని వివరించారు. రాబోవు 2029 లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న ఆశను వ్యక్త పరిచారు. చరణ్‌ సింగ్‌ గారు ఉత్తర ప్రదేశ్‌ కోసం, అమర్‌ గోస్వామి గుజరాత్‌ కోసం కార్‌ ర్యాలీ లాంటివి చేసినవి తెలిపారు, ఆక్టర్‌ పటేల్‌ తన పాటలతో, డాన్సులతో మారు మ్రోగించారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుధీర్‌ పరేఖ్‌, శ్రీ జయేష్‌ పటేల్‌, శ్రీ పీయూష్‌ పటేల్‌, శ్రీమతి వంటి ప్రముఖ కమ్యూనిటీ నాయకులు మరియు వాలంటీర్లు సహా న్యూజెర్సీ అంతటా భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. కల్పనా శుక్లా, మా రాజ్యలక్ష్మి, శ్రీమతి దీప్తి జానీ, శ్రీ సంతోష్‌ రెడ్డి, శ్రీ గణేష్‌ రామకృష్ణన్‌, శ్రీ మధుకర్‌ రెడ్డి, శ్రీ శివదాసన్‌ నాయర్‌, శ్రీమతి. జయశ్రీ, శ్రీ గోవిందరాజ్‌, శ్రీ ఓంప్రకాష్‌ నక్క, శ్రీ జగదీష్‌ యలిమంచిలి, శ్రీ ప్రవీణ్‌ తడకమళ్ల , శ్రీ రఘు రెడ్డి, శ్రీ రామ్‌ వేముల, శ్రీ శ్రీ శరత్‌ వేముల, శ్రీ విజయ్‌ కుందూరు, శ్రీ శ్రీనివాస్‌ గనగోని, శ్రీ శ్రీకాంత్‌ రెడ్డి, శ్రీ పృధ్వి, శ్రీ రవి పెద్ది, శ్రీ నాగ మహేందర్‌, శ్రీ మధు అన్న, శ్రీ భాస్కర్‌, శ్రీ దాము గాదెల, శ్రీ ప్రవీణ్‌ గూడూరు, శ్రీ సుధాకర్‌ ఉప్పల, శ్రీమతి మృధుల, శ్రీమతి లక్ష్మీ మోపర్తి, శ్రీ గురు ఆలంపల్లి, శ్రీ గోపి, ఇంకా చాలా మంది కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు

 

Click here for Photogallery

 

 

Tags :