ASBL Koncept Ambience
facebook whatsapp X

అలేఖ్య పంజల గారికి లాస్యసంజీవని బిరుదు ప్రదానం 

అలేఖ్య పంజల గారికి లాస్యసంజీవని బిరుదు ప్రదానం 

అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు పది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు అక్టోబర్ 3 వ తేదీన గోరుకంటి మేఘన శిక్షణలో కమలాకర సంగీత నృత్య కళాక్షేత్రం ఇన్స్టిట్యూట్ నుండి వారి శిష్య బృందం పుష్పాంజలి, కొండలలో నెలకొన్న వంటి కీర్తనలకు తగిన నృత్య ప్రదర్శనతో అలరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నృత్య కళాకారిణి డా అలేఖ్యకు "లాస్యసంజీవని" బిరుదుని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి దేవనార్ ఫౌండేషన్ అధినేత సాయిబాబా గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పద్మశ్రీ డా.శోభరాజు చేస్తున్న ఈ అమోఘమైన కార్యక్రమాలను, అన్నమాచార్య భావనా వాహిని సంస్థ యొక్క గొప్పిసేవలను కొనియాడారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమం ముగిసింది.

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :