Duvvada – Madhuri : దువ్వాడ శీను, దివ్వెల మాధురి... ఇక అంతా ఓపెన్..?
మన దేశంలో కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీన్ని ఎంతో పవిత్రంగా చూస్తుంటాయి. అయితే కొన్ని కుటుంబాల్లో (Family) చిన్నాచితకా ఇబ్బందులు సహజమే. ఇలాంటప్పుడు చాలా మంది సర్దుకుపోతుంటారు. కుదరనప్పుడు భార్యాభర్తలు (wife and husband) వేరుగా ఉంటుంటారు. మరీ శ్రుతి మించితే విడాకులు (divorce) తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని బహిరంగంగా చెప్పుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. చెప్తే సమాజం (society) తమను చిన్నచూపు చూస్తుందనే భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకే బయట పెట్టుకోరు.
ఇక రాజకీయ నాయకులు (politicians), సినిమా ప్రముఖుల (cinema stars) కుటుంబాల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అవి బయటకు రాకుండా ఉండవు. వాళ్లవి పబ్లిక్ (public) జీవితాలు. కాబట్టి ఏ చిన్న సంఘటన జరిగినా అది పబ్లిక్ లోకి వచ్చేస్తుంటుంది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) చెందిన ఎమ్మెల్సీ (MLC) దువ్వాడ శ్రీను (Duvvada Srinu) వ్యవహారం కూడా ఇలాగే వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నారాయన. అయితే మరో మహిళ దివ్వెల మాధురి (Divvela Madhuri) వల్లే తమ కుటుంబంలో గొడవలు వచ్చాయని.. శీను మాకే కావాలని ఆయన భార్య, పిల్లలు డిమాండ్ చేశారు. వీళ్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అయినా దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి మాత్రం వెనక్కు తగ్గలేదు. తాము కలిసే ఉంటామని తేల్చి చెప్పారు. భార్య దువ్వాడ వాణికి (Duvvada Vani) విడాకులు ఇవ్వబోతున్నట్టు దువ్వాడ శీను స్పష్టం చేశారు. అంతేకాదు.. తాను కట్టుకుంటున్న ఇంటిని దివ్వెల మాధురి పేరు మీద రాయించేశారు. దీంతో వాళ్లిద్దరి మధ్య గట్టి బంధం ఉన్నట్టు తేలిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులో (court) ఉంది. వాళ్లకు విడాకులు (divorce) మంజూరైతే అధికారికంగా మాధురిని పెళ్లి చేసుకునేందుకు శీను సిద్ధమవుతున్నారు. అయితే మాధురికి ఇప్పటికే పెళ్లయింది. భర్త అమెరికాలో ఉంటారు. ఆయన కూడా మాధురి చేస్తున్నది కరెక్టే అని చెప్తుండడమే ఇందులో పెద్ద ట్విస్ట్.
కోర్టు శీనుకు, వాణికి విడాకులు ఇస్తుందో లేదో తెలీదు. కానీ శీను, మాధురి మాత్రం చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేస్తున్నారు. మాధురి సోషల్ మీడియాలో (social media) రోజూ వివిధ రకాల వీడియోలు పెడుతూ హడావుడి చేస్తున్నారు. తాజాగా శీను, మాధురి కలిసి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. కలిసే దర్శనం చేసుకున్నారు. ఇంటి వద్ద స్కూటీలో మాధురిని ఎక్కించుకుని శీను చక్కర్లు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు వీళ్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధురికి పెళ్లయింది. భర్త ఉన్నాడు.. శీనుకు భార్యపిల్లలు ఉన్నారు. అయినా శీను, మాధురి మాత్రం తమ ప్రపంచమే వేరన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ ఏమనుకుంటుందోననే భయం కూడా వాళ్లకు లేకపోవడం ఆశ్చర్యం.