Tirumala-Chandrababu record: తిరుమలలో చంద్రబాబు సరికొత్త రికార్డు..
ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Laddu) విషయం చాలా హాట్ టాపిక్ గా ఉంది. ఇక దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu) చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.. ఇంకా ఈ విషయం ఒక కొలిక్కి రాలేదు. అయితే ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా. ఈ నేపథ్యంలో తిరుమల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబుకి ఓ విచిత్రమైన కనెక్షన్ బయటపడింది. అంతేకాదు ఈ విషయంలో చంద్రబాబు ఓ సరికొత్త రికార్డును( Chandrababu tirumala record) కూడా స్థాపించారు.
శ్రీవారి సాలకట్టు బ్రహ్మోత్సవాలు (Tirumala Bramhostavalu) ఏట ఆశ్రయుజ మాసం పాడ్యమినుంచి తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు (Bramhostavalu) ఎంతో ప్రత్యేకత ఉంది.. ఏటా జరిగే ఈ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అందుకే ఈ సంవత్సరం కూడా సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇది మామూలుగా జరిగేదే కదా ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా?
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలోనే చంద్రబాబు ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటికే 14 ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 14 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంటే ఇప్పుడు సమర్పించిన దానితో కలిపి మొత్తం 15 సార్లు చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించినట్లు అయ్యింది. ఇలా ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా 15 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించింది లేదు. దీంతో ఈ సరికొత్త రికార్డు చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళింది. ఈ విషయాన్ని సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అక్కడ ఉన్న టిటిడి అధికారులే స్వయంగా వెల్లడించారు. ఇది విని మురిసిపోయిన చంద్రబాబు ఇలా స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం తనకు కలగడం తన అదృష్టం అని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన వాహన సేవలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.