అభిమాని కోసం తరలివచ్చిన సీఎం.. బాబులో ఇంత మార్పు ఎక్స్పెక్ట్ చేశారా?
2024 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి (AP CM) చంద్రబాబులో ( Chandra Babu ) లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇక మీరు కొత్త చంద్రబాబును చూస్తారు అని ఆనాడు చెప్పిన బాబు ఆ మాట నిలబెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. తనను అభిమానించే వారి కోసం.. వారి సమస్యలను పరిష్కరించడం కోసం చంద్రబాబు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మొన్న విజయవాడ వరదల్లో కూడా ఆయన అందించిన సహాయ సహకారాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఇప్పుడు చంద్రబాబు మరొకసారి తాజాగా అలాంటి పని చేసి చూపించారు. క్యాన్సర్ తో పోరాడుతూ తుది క్షణాలలో ఉన్న ఓ అభిమాని కోసం చంద్రబాబు స్వయంగా రావడం అందరిని షాక్ కి గురిచేసింది. తన జీవితంలో ఒక్కసారి అయినా చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలి అన్న ఆ అభిమాని కోరికను చంద్రబాబు నెరవేర్చారు. చంద్రబాబులో ఇటువంటి మార్పు ఎన్నడూ ఊహించలేదని అందరూ అనుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన సుధీర్ బాబుకు 30 సంవత్సరాలు. ఆయన చంద్రబాబు వీరాభిమాని.. అందుకే ఒక్కసారైనా చంద్రబాబుతో ఫోటో దిగాలి అని కోరుకునేవారు. దివ్యాంగుడైన అతని ఆఖరి కోరిక గురించి అతని బంధువులు స్థానిక నేతలకు తెలియపరిచారు. వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చంద్రబాబుకి ఈ విషయం గురించి చెప్పారు.
తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం గేటు వద్దకు చేరుకున్న చంద్రబాబు వాహనం దిగి నేరుగా సురేంద్రబాబు వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. అలా కానీ ఎంతో ఆరాధించే సీఎం స్వయంగా తన వద్దకు నడుచుకుంటూ రావడం చూసి సురేంద్రబాబు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. సురేంద్రబాబు ఆశపడ్డట్టుగా అతనితో ఫోటో దిగిన చంద్రబాబు అనంతరం అతని చికిత్స కోసం 5 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. అంతేకాదు భవిష్యత్తులో అతనికి ఎటువంటి అవసరం ఉన్న తన వద్దకు తీసుకురావాలి అని స్థానిక నేతలకు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఇప్పుడు చూస్తున్న చంద్రబాబు తమకు తెలిసిన చంద్రబాబు ఒకరేనా అని ఆశ్చర్యపోతున్నారు.