ASBL Koncept Ambience
facebook whatsapp X

డల్లాస్‌లో గాంధీ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి

డల్లాస్‌లో గాంధీ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి

గత వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా డల్లాస్‌లోని గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుతో కలిసి స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగింది. అహింస, శాంతి ఆయుధంగా స్వేచ్చ, సమానత్వం కోసం పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను గుర్తు చేసుకొని, భావితరాలు ఆయన బాటలో పయనించాలని మంత్రి పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచ దేశాల్లో సుప్రసిద్ధులని శాంతి సమానత్వం కోసం ఆయన అహింసా మార్గంలో జరిపిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని  స్పీకర్‌ పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :