ఐదవ రోజు నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన రామ గానం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" కార్యక్రమంలో ఐదవ రోజున అక్టోబర్ 7వ తేదీన గాయకుడు శ్రీ రామాచారి గారు నారాయణతే నమో నమో, గోవిందా శ్రిత గోకుల బృందా, శిరుత నవ్వుల వాడు సిన్నెక వంటి ప్రజాదారణ పోందిన సంకీర్తనలాపించారు.
అతిథి గా విచ్చేసిన శ్రీ చంద్ర శేఖర్ చరణ్ గారు అన్నమయ్య సంకీర్తనకు నిలయం అన్నమాచార్య భావనా వాహిని సంస్థ అన్నారు.
కార్యక్రమం అనంతరం కళాకారులను సాలువా సంస్థ చిత్ర పటాన్ని, వస్త్రలతో సత్కరించారు. సంకీర్తనా కార్యక్రమానికి కీబోర్డ్ రాజు, తబలా అజేయ్ వాద్యసహకారం అందించారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమం ముగిసింది.
Tags :