అన్నమయ్యపురంలో నాదబ్రహ్మోత్సవ్ - ఆకట్టుకున్న సౌమ్య వారణాసి సంకీర్తనలు
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా రెండవరోజు అక్టోబర్ 4 వ తేదీన సౌమ్య వారణాసి ఆలపించిన జయలక్ష్మి వరలక్ష్మి, గోవింద సుందర, ఇరవగు వారికి వంటి అన్నమాచార్య సంకీర్తనలతో అలరించారు. కీబోర్డ్ తో రాజు తబలాతో అజయ్ వాద్యసహకారం అందించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అనితా రాజేంద్రన్ ఐ.ఏ.ఎస్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథిగా మెహే జబీనా విచ్చేశారు.పద్మశ్రీ డా.శోభరాజు చేస్తున్న నాదబ్రహ్మోత్సవ్ కార్యక్రమాలను, అన్నమాచార్య భావనా వాహిని సంస్థ యొక్క గొప్పిసేవలను కొనియాడారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమం ముగిసింది.