రాష్ట్రాలకు పన్నుల వాటా ప్రకటించిన కేంద్రం.. ఏపీకి దక్కిందెంత?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిచ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు నెలవారీ పన్నుల వాటా రూపంలో రూ.89,086.50 కోట్లను కేంద్రం అందిస్తుంది. ఈసారి మాత్రం ఏకంగా రూ.1,78,173 కోట్ల మేర పన్నుల వాటా విడుదల చేసింది. ఇందులోనే ఒక నెల ముందస్తు చెల్లింపు (అడ్వాన్స్ పేమెంట్)ను కూడా చేర్చినట్టు కేంద్రం తెలిపింది. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.7,211 కోట్లు దక్కనుండగా... తెలంగాణకు రూ.3,745 కోట్లు లభించనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.31,962 కోట్ల మేర పన్నుల వాటా కేటాయించారు.
Tags :